జూలై నుండి మ్రోగనున్న బడి గంట.
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమే తల క్రిందులైతుంది. అగ్రదేశాలు సైతం.. వైరస్ దెబ్బకు కకావికలం అవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు మందులేకపోవడంతో.. దాన్నికట్టడి చేసేందుకు లాక్ డౌన్ కు ఫరిమితం అవుతున్నారు. దీంతో బడి, గుడి, మాల్స్, హోటల్స్, రైళ్ళు, బస్సులు ఇలా అన్నింటికి లాక్ డౌన్ తో బ్రేకులు పడ్డాయి. అయితే.. వ్యవస్థ మెత్తం లాక్ డౌన్ తో స్థంబించి పోవడంతో.. మొత్తం ఆర్తిక వ్యవస్థపై బారం పడటంతో.. ఒక్కోక్కటిగా.. సడలింపులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిలో బాగంగా లాక్ డౌన్ తో మూత పడిని పాఠశాలలను జూలై నుండి తెరవాలని నిర్ణయించింది కేంద్రం. అయితే పాఠశాలలో ముందే చిన్న పిల్లలు.. వీరిని కరోనా కబలించడం ఈజీ.. దీంతో .. పాఠశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలను నిర్ధేశించింది కేంద్ర ప్రభుత్వం.
స్కూల్స్ తిరిగి ప్రారంభించాక అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే….
* జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు.
* ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు.
* ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు.
* జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు.
* ప్లే గ్రౌండ్లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి.
* 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.
* ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు.
* ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు.
* ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్ను 70 శాతానికి తగ్గిస్తారు.
* మొత్తం పని దినాలను 150 రోజులకు తగ్గించింది ప్రభుత్వం.
* 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఆదివారం మాత్రమే సెలవు.
* పాఠశాల పని గంటల్లో ఒక గంటను తగ్గించారు.
* 8-10 తరగతులకు ప్రతి రోజూ క్లాసులు.
* ఉన్నత పాఠశాల విద్యార్థులు కౌమారదశలో ఉంటారు. వారికి వారంలో 5 రోజులు తరగతులు నిర్వహిస్తే సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు వ్యవసాయ, ఇతర పనుల్లో నిమగ్నమై పిల్లల క్షేమాన్ని అంతగా పట్టించుకోరు. అందుకే వీరికి వారంలో 6 రోజులు తరగతులుంటాయి.
* కరోనా కారణంగా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పాయింట్ల పెంపు.. ఒక్కో తరగతికి వేర్వేరుగా భోజనాన్ని అందజేసే విధానం.