
భోపాల్ : సాధారణంగా నచ్చని వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటే పగ పట్టారు అంటాము. ఇక పగ అంటే పాము పగతో పోలుస్తారు. పాము పగ పై హితిహాసాలనుండి ఇప్పడి వరకు ఎన్నో కథలు మనము వింటూనే ఉన్నాం. కానీ కావ్..కావ్ మనే కాకులు కూడా పగ పడతాయా అంటే మాత్రం ఆశ్యర్యం కలగకమానదు. కాని ఇది నిజం… కాకులు కూడా పగ పడతాయనడానికి మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటననే సాక్షం. మధ్యప్రదేశ్కు చెందిన శివ కేవత్ అనే దినసరి కూలీపై ఏకంగా మూడేళ్ళుగా కాకులు పగపట్టాయి . కాదు కాదు హోల్ సెల్ గా కాకి సమాజమే అతనిపై పగపట్టాయి. ఈ కాకుల భయానికి అతను ఇంట్లోనుండి కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు.ఇంతకు అతను చేసిన పాపం ఏంటా అనుకుంటున్నారా .. ఐతే వివరాల్లోకి వెళదాం.
మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన శివ కేవత్ మూడేళ్ల క్రితం పనికి వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలో ఉన్న కాకి గూట్లో పిల్ల కాకి మూలుగు విని దాని దగ్గరకు వెళ్లాడు. గాయంతో విలవిల్లాడుతున్న కాకి పిల్లను చేతిలోకి తీసుకుని నిమురుతుండగానే అది ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా అప్పుడే గూటికి దగ్గరకు వచ్చిన తల్లి కాకి సహా ఇతర కాకులు పిల్ల కాకిని శివ చంపేశాడని భావించాయి. ఇక ఆనాటి నుంచి అతడిపై పగబట్టాయి. ఇంట్లో నుంచి శివ బయటికి వెళ్లే సమయంలో అక్కడికి చేరుకుని రోజూ అతడిని ముక్కుతో పొడవడంతో పాటుగా కాళ్లతో ముఖం, చేతులపై దాడి చేయడం ప్రారంభించాయి. ఇది మూడేళ్ళుగా కొనసాగుతూఉంది.
కాగా మొదట్లో ఇదంతా యాధృచ్చికంగా జరుగుతోందని భావించిన శివకు రాను రాను అసలు విషయం అర్థమైంది. దీంతో వాటిని తప్పించుకుని పోయేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కాకులు మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. మూడేళ్లుగా తాను అనుభవిస్తున్న బాధ గురించి శివ మాట్లాడుతూ..‘ నేను కాకి పిల్లను కాపాడాలనుకున్నాను. కానీ అది నా చేతుల్లో ప్రాణాలు విడిచింది. దీంతో నేనే దాన్ని చంపానని కాకులు భావిస్తున్నాయి. వాటి ఙ్ఞాపక శక్తి అమోఘం. ఇన్నేళ్లు అయినా నా ముఖాన్ని మర్చిపోకుండా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా నన్ను క్షమించి వదిలి పెడితే బాగుండు అని వాపోతున్నాడు శివ. ఇదంతా వింటుంటుంటే వామ్మో అనిపిస్తుంది కదు .. అందుకే కాకే కదా అని దాడిచేసారో .. ఇక అంతే ..ఈ శివకు పట్టిన పరిస్థితే మీకు తప్పదు ..తస్మాత్ జాగ్రత్త