Atli Arjun

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్ లో మూవీ

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్‌

మూవీ రిపోర్ట్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప 2 (Pusha-2) సినిమా తరువాత, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో నటించబోతన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ తో పాటు ఫిల్మ్ నగర్ లో ఇదే మాట వినిపిస్తోంది. విజయ్‌ తో తెరి, మెర్సల్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను రూపొందించిన డైరెక్టర్ అట్లీ.. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ (Sharkh Khan) హీరోగా జవాన్‌ (Jawan) తెరకెక్కించాడు. గురువారం జవాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా జవాన్ యూనిట్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. జవాన్‌ షూటింగ్ ఏప్రిల్‌ లోనే పూర్తయిందని, తాను ఊహించిన దానికన్నా సినిమా గొప్పగా వచ్చిందని డైరెక్టర్ అట్లీ చెప్పారు. షారుక్‌ సైతం చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.

భావోద్వేగాలను కీలకంగా తీసుకుని జవాన్ సినిమాను రూపొందించామని అట్లీ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎమోషన్‌ కు మంచి ప్రాధాన్యత ఇస్తారని.. ఇక్కడ తప్పక అన్నివర్గాల వారికి జవాన్ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసమే షారుక్‌ తో పాటు చిత్రం బృందం తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నామని అట్లీ చెప్పారు. అల్లు అర్జున్‌ తో సినిమా తెరకెక్కిస్తారా.. అన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చిని అట్లీ.. బన్నీకి కథ చెప్పాను.. చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే మంచి విషయం చెబుతాను.. అని సమాధానం చెప్పారు. దీన్ని బట్టే తెలుస్తోంది అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో త్వలరోనే సినిమా అనౌన్స్ చేయబోతున్నారని.


Comment As:

Comment (0)