Delhi

బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి

ఫ్రెండ్ కూతురిపై ఉన్నతాధికారి అత్యాచారం

డిల్లీ క్రైం రిపోర్ట్- దేశ రాజధఆని ఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడి మైనర్‌ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ స్త్రీ, శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక సీనియర్‌ అధికారి స్నేహితుడు 2020లో చనిపోయాడు. దాంతో స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తె బాగోగులు చూసుకుంటానంటూ నిందితుడు ముందుకొచ్చాడు. బాలిక తన కుటుంబంతో పాటు కలిసి ఉంటుందని ఆమె తల్లికి చెప్పాడు. అధికారితో తమ కుటుంబానికి కొన్నేళ్లుగా స్నేహం ఉండడంతో బాలికను అతడితో పంపేందుకు తల్లి ఒప్పుకుంది. బాలికను ఇంటికి తీసుకెళ్లిన అధికారి ఆమెపై నవంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య అనేకసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు నిందితుడి భార్య సైతం అతడికి సహకరించిందని పోలీసులు విచారణలో తేలింది.

ఆమె తన కుమారుడితో గర్భస్రావం అయ్యేందుకు టాబ్లెట్స్ తెప్పించి బాలికతో మింగించింది. ఆ తరువాత బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లి ఆమెను ఇంటికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలో బాలికను హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడి కౌన్సిలర్‌ కు జరిగిన విషయమంతా చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉన్నతాధికారి రాష్ట్ర స్త్రీ శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నట్లు మాత్రమే వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం అతని వ్యక్తిగత వివరాలను తెలపలేదు. కూతురు వయస్సున్న మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. Delhi Crime


Comment As:

Comment (0)