ఈనెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన
న్యూ ఢిల్లీ-వరంగల్- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన వరంగల్ లో రానున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోదీ 8న ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 9.45 గంటలకి హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు ఆర్మీ హెలికాప్టర్ లో వరంగల్ కు బయల్దేరి వెళతారు. 10.35కి వరంగల్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
వరంగల్ లో 10.45 నుంచి 11.20 వరకు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తరువాత 12.15కి వరంగల్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 1.10 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపధ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అటు బీజేపీ మోదీ పర్యటనను సక్సెస్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.