Newspillar
Newspillar
Tuesday, 27 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారాహికి, వరాహికి సీఎం జగన్ తేడా తెలుసుకోవాలని పవన్ హితువు పలికారు. తాను ఊగిపోతూ మాట్లాడతా అని జగన్‌ అంటున్నారని, ఇకపై జగన్‌ స్టైల్‌ లో మాట్లాడుతానని పవన్ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు.

తాను చెప్పు తీసి చూపించి మాట్లాడా అంటే దాని వెనుక చాలా జరిగిందని పవన్ కల్యాణ్‌ చెప్పారు. భీమవరంలో జనసేన జెండా ఎగరాల్సిందేనని, ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదని పవన్ అన్నారు. జనసేన రావాలంటే జగన్ పోవాలన్న జనసేనాని.. కస్తూరిబా కాలేజీకి దేశ నేతలు పేర్లు మార్చడం సరికాదని చెప్పారు.  తనకు జ్వరం ఉన్నా మీ మీద ప్రేమతో వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్.. 30వ తేదీన సీఎం జగన్ గురించి మొత్తం మాట్లాడతానని వ్యాఖ్యానించారు.