Newspillar
Newspillar
Wednesday, 05 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్- గత కొన్ని రోజులుగా జనసేని అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన భార్య అనా కొణిదెల (Anna Lezhneva) కు విడాకులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనా మెగా కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనడం లేదని, అసలు అనా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఉండటం లేదనే చర్చ జరుగుతూ వస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో ఇలాంటి వదంతులకు తెర దించుతూ పవన్ కళ్యాణ్, అనా కొణిదెల కలిసి ఉన్న తాజా ఫోటోను అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది జనసేన.

పవన్ కళ్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌ లోని తమ నివాసంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు..’’ అని పవన్ కళ్యాణ్, అనా కలిసి ఉన్న ఫొటోని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

జనసేన ట్విట్టర్ పోస్ట్ తో పవన్ కళ్యాణ్, అనా కొణిదెల విడిపోతున్నారన్న ప్రచారానికి తెరపడింది. త్వరలోనే ఈ అంశంపై పవన్ సైతం స్పందించనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కేవలం రాజకీయ కోణంలోనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.