Newspillar
Newspillar
Monday, 17 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

భోపాల్ రిపోర్ట్- ఏఐసీసీ (AICC) అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లు ప్రయాణిస్తున్న విమానం  (Flight) ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ (Emergency Landing)​ అయింది. మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ (Bhopal) ఎయిర్‌ పోర్ట్‌ లో వారి విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భోపాల్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయినట్లు భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణ్‌ చారీ మిశ్రా తెలిపారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కు ప్రతికూల వాతావరణమే కారణమని సమాచారం. 

కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు మంగళవారం బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పారు.