Newspillar
Newspillar
Monday, 14 Aug 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan) అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ramgopal Varma). ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పానన్ రాము.. తాను జగన్‌ గురించి ఏమనుకుంటున్నానో అదే తన తాజా సినిమా వ్యూహం (Vyuham) లో చూపిస్తానని తెలిపారు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం సినిమా తీస్తున్నానని రాంగోపాల్‌వర్మ చెప్పారు. వ్యూహం మూవీని రెండు భాగాలుగా తీస్తున్నానని, వచ్చే ఎన్నికలకు ముందే రెండింటినీ విడుదల చేస్తామని తెలిపారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజీపై వ్యూహం మూవీ షూటింగ్‌ సందర్భంగా రాంగోపాల్ వర్మ మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమా ప్రజలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది తనకు తెలియదన్న వర్మ.. తాను నమ్మిన నిజాన్నే సినిమాలో చూపిస్తానని చెప్పారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తరువాత, ఎవరెవరు వారికి అనుకూలంగా ఎలాంటి వ్యూహాలు రచించారనేదే వ్యూహం కథ అని చెప్పుకొచ్చారు రాంగోపాల్ వర్మ. ఇక వ్యూహం సినిమా రెండో భాగంలో వివేకా హత్య ఘటనను చూపిస్తానని రాంగోపాల్ వర్మ చెప్పారు. తన దృష్టిలో హత్య కేసు నిందితులు ఎవరనేది సినిమా చూస్తేనే తెలుస్తుందన్నారు. వ్యూహంలో మూవీలో సీఎం జగన్‌ తోపాటు పవన్‌ కళ్యాణ్, నారా లోకేశ్‌ సహా చాలా పాత్రలూ ఉంటాయని, ఏపీ రాజకీయాల్లోని ప్రధాన సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నానని తెలిపారు. Ramgopal Varma Vyuham Movie