Newspillar
Newspillar
Sunday, 13 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

తెలంగాణ రిపోర్ట్- కేసీఆర్ సర్కార్ తెలంగాణ (Telangana) రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు రుణమాఫికి (Farmer Loan Waiver) ఎట్టకేలకు మోక్షం లభించింది. లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీని పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 10,79,721 మంది రైతులకు 6,546.05 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ఆదేశాల మేరకు ఆర్థికశాఖ రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసింది. 

తాజాగా చేసిన రైతు రుణమాఫీతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 16.66 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసినట్లు అయింది. తెలంగాణలో మొత్తంగా 7,753 కోట్లను రుణామాఫీకి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి గత నాలుగున్నరేళ్లుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుండగా.. అది ఇప్పటికి సాధ్యమైంది.