Newspillar
Newspillar
Sunday, 03 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఉదయ నిధి స్టాలిన్‌ వివరణ ఇచ్చారు. తాను కుల భేదాలు నశించాలని అన్నానని, కేవలం హిందూయిజంలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ భేదాలు పోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

ఆదివారం కార్యక్రమమంలో తాను ఏదైతే చెప్పానో దాన్నే మళ్లీ చెప్తున్నా.. కులం అనేది నశించాలి.. అది ఏ మతంలో ఉన్నా.. అని ఉదయ నిధి స్టాలిన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఇండియా కూటమిని చూసి బీజేపీ (BJP) భయపడుతోందని, దాని నుంచి అందరి దృష్టి మరల్చడానికే ఇవన్నీ చేస్తోందని ఉదయ నిధి ఆరోపించారు. ప్రధాని మోదీ పదే పదే కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూ ఉంటారని, అంటే కాంగ్రెస్‌ ను చంపేయమని అర్థమా.. అని ప్రశ్నించారాయన.

ఇక తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై వివాదం కంటిన్యూ అవుతోంది. ఉదయనిధి వ్యాఖ్యలపై ఇండియా (I.N.D.I.A) కూటమి క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన స్టాలిన్‌ కాదు హిట్లర్‌ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు. ఎవరి మనోభావాలూ దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత విషయమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.