Newspillar
Newspillar
Saturday, 21 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- స్టార్ మా లో ప్రసారం అవుతున్న తెలుగులో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu 7) రోజు రోజుకు అందరిలో ఆసక్తి రేపుతోంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా పలువురు కంటెస్టెంట్‌లు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. క్రమంలో కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబీపురం అంటూ విడిపోయి పోటీ పడటం రసవత్తరంగా మారింది. కొన్ని రోజుల క్రితం టాస్క్‌లో భాగంగా గాయపడిన శివాజీ (Sivaji) చేతికి సపోర్ట్‌ బ్యాండ్‌ ధరించి కనిపిస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి బృందంలోని సభ్యులు మిగిలిన వారిలో ఒకరిని అనర్హుడిగా ప్రకటించి అతడి ఫొటోకు గొలుసు కట్టి స్విమ్మింగ్‌పూల్‌ లో పడేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించడంతో, శివాజీ ఫొటోకు అమర్‌దీప్‌ గొలుసు కట్టి స్విమ్మింగ్ పూల్‌లో పడేశాడు.

ఈ క్రమంలో శివాజి, అమరదీప్ మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మీకన్నా ఇతరులు ఎక్కువ కష్టపడి ఆడారు కదా.. ఒక ఛాన్స్‌ ఇద్దామని అమర్‌ దీప్ చెప్పగా, నేను వేస్ట్‌ క్యాండిడేట్‌లా కనిపిస్తున్నానా, ఇది న్యాయమైన ఆటా.. అంటూ శివాజీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివాజీని కన్‌ఫెషన్‌ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్‌.. శివాజీ ఎలా ఉన్నారని ప్రశ్నించగా, బాగా ఇబ్బంది పడుతున్నా బిగ్‌బాస్‌.. చేయి అంతా లాగుతోంది.. ఎవరూ లేకపోతే నేనే ఏడుస్తున్నా.. ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా.. వాళ్ల అందరి ముందు ఏడవలేకపోతున్నా.. లోపల చాలా బరువుగా ఉంది.. అంటూ బోరున ఏడ్చేశారు. శివాజీ అలా కన్నీటిపర్వంతం అవ్వడంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఏంజరగబోతోందంటూ ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది.