Newspillar
Newspillar
Sunday, 10 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు వైసీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌ లో రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. దీంతో అధికార వైసీపీకి రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి, వైసీపీ కి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని ఆర్కే చెప్పారు. స్పీకర్‌ కార్యాలయంలో లేఖను అందజేయడంతో పాటు.. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఇక ఏపీలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జీలను నియమించింది వైసీపీ పార్టీ. మొత్తం మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.