Newspillar
Newspillar
Monday, 12 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

విజయవాడ క్రైం- ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలోని సినిమాహాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహమ్మద్‌ జాస్మిన్‌ (Jasmin) (20) బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఎస్‌.కె.జబీబుల్లా ఇనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు స్థానికంగా బైక్ మెకానిక్. అతడికి పెళ్ళై.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాస్మిన్‌, జబీబుల్లాల పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు సన్నిహితంగా మెలిగేవారు.

జాస్మిన్ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో  తమ అమ్మాయి జోలికి రావద్దని జబీబుల్లాను పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో ఇటీవల ఇల్లు మారిన జబీబుల్లా గత రెండు మూడు రోజులుగా జాస్మిన్‌ ఫోన్‌ ఎత్తడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన జాస్మిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఫ్యాన్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాస్త ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన చిన్నఅవుటపల్లిలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాస్మిన్ చనిపోయింది.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు జాస్మిన్ మృతికి జబీబుల్లా కారణమవ్వడంకో, కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు జబీబుల్లాను చితకబాది పోలీసులకు అప్పగించారు. తమ కూతురును శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన జబీబుల్లాపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జబీబుల్లాపై కేసు నమోదుచేసిన గన్నవరం పోలీసులు నిందితుడిని ఆదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.