Newspillar
Newspillar
Thursday, 29 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

ఆంధ్రప్రదేశ్- ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan) చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడని ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) అన్నారు. జగన్ ముందు బకాసురుడు సైతం తక్కువేనని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పరుచూరి సుభాష్‌ చంద్రబోస్‌ మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు టీడీపీ (TDP) కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓడితే రాష్ట్రం గెలిచినట్లేనని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం గెలుపు కోసం ప్రతిఒక్కరూ గ్రామ గ్రామాన కష్టపడాలని పిలుపునిచ్చారు. మనం మారకపోతే జీవితాలు మారవనే వాస్తవం గ్రహించే వైసీపీ నేతలు టీడీపీవైపు చూస్తున్నారని చంద్రబాబు కామెంట్ చేశారు. ప్రశాంతమైన విశాఖలో ఇప్పుడు భయపడే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, టీడీపీ నేతలు కొనకళ్ల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీలోకి అధికార వైసీపీలోంచి వలసలు ఇంకా కొనసాగుతాయని చంద్రబాబు చెప్పారు.