Newspillar
Newspillar
Sunday, 16 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ రిపోర్ట్- శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ (Anju Yadav) పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మరోసారి ఫైర్ అయ్యారు. ఈమేరకు శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌ పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌  రెడ్డి (SP Parameshwar Reddy) కి ఫిర్యాదు చేశారు పవన్.  సోమవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రేణిగుంటకు, అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ అంజూ యాదవ్ పై పిర్యాదు చేశారు. 

వారం రోజులక్రితం మధ్య శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి (Kotte Sai) పై సీఐ అంజూ యాదవ్‌ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్ తిరుపతికి వెళ్లి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. జనసైనికులు శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో కొట్టే సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్నారని పవన్‌ చెప్పారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించినందుకు హెచ్‌ఆర్సీకి ధన్యవాదాలు తెలిపారు.