Newspillar
Newspillar
Monday, 24 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ప్రపంచ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌ (Kareena Kapoor )నారాయణ మూర్తి దంపతులు మధ్య జరిగిన ఇంట్రస్టింగ్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులను కరీనా కపూర్ అంతగా పట్టించుకోరని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా, ఆయన మాటలను సతీమణి సుధామూర్తి (Sudha Murthy) వ్యతిరేకిస్తూ కరీనాకు మద్దతుగా కామెంట్ చేశారు.

అసలేం జరిగిందంటే.. ఈ సంవత్సరం ప్రారంభంలో నారాయణ మూర్తి దంపతులు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ టైంలో నారాయణ మూర్తి మాట్లాడుతుండగా కరీనా కపూర్ ప్రస్తావనను తెచ్చారు. ఆయన కరీనా గురించి చెబుతూ.. ఓసారి నేను లండన్‌ (London) నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్‌ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి ఆమెను పలకరించారు. ఐతే ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని కొంత సమయమైనా మాట్లాడటం సంప్రదాయం. మన నుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే.. అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో నారాయణ మూర్తి పక్కనే ఉన్న ఆయన సతీమణి సుధామూర్తి ఆయన మాట మధ్యలో కల్పించుకుంటూ.. ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారు.. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుంది.. ఓ సాఫ్ట్‌వేర్‌ వ్యక్తి,. కంపెనీ ఫౌండర్‌ అయిన నారాయణ మూర్తికి 10 వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ కరీనా కపూర్ లాంటి సినీ నటికి కోట్ల మంది అభిమానులు ఉంటారు కదా.. అని కరీనాకు మద్దతుగా మాట్లాడారు సుధఆ నారాయణ మూర్తి. ఇంకేముంది సరదాగా నవ్వడం అక్కడున్నవారు వంతైంది. నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఇక్కడ సమస్య అది కాదు.. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి.. అది ఏ రూపంలో ఐనా సరే.. తిరిగి ప్రేమ చూపించడం చాలా ముఖ్యం.. అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఐటీ దిగ్గజం నారాయణ మూర్తి కరీనా కపూర్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.