Newspillar
Newspillar
Sunday, 13 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

న్యూ ఢిల్లీ- కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్వి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రధాని మోదీపై పోటీ చేయబోతున్నారా? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి (varanasi) నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఉద్దవ్‌ ఠాక్రే వార్గానికి చెందిన శివసేన ఎంపీ ప్రియాంక పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పోటీ చేస్తే ప్రియాంక గాంధీ ఖచ్చితంగా గెలుస్తారని ఎంపీ సంజయ్‌ రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారణాసి, అమేథీ, రాయ్‌బరేలీ లో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని ఆయన అన్నారు. ఇక పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలసుకోగా లేనిది శరద్‌ పవార్, అజిత్‌ పవార్ లు ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు సంజయ్ రౌత్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న సంజయ్‌, ప్రస్తుత ప్రభుత్వంపై మహారాష్ట్ర ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ సహా రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు.