Newspillar
Newspillar
Monday, 28 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- ఏపీ మంత్రి, సీని.ర్ నటి రోజా (Roja) భర్తకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో నమోదైన పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో డైరెక్టర్‌ ఆర్‌.కె.సెల్వమణిపై (RK Selvamani) నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయింది. చెన్నై జార్జ్‌ టౌన్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రోజా భర్త అయిన సెల్వమణి పలు తెలుగు, తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ కేసులో ముకుంద్‌ చంద్‌ బోత్రా (Mukund Chand Botthra ) అనే సినిమా ఫైనాన్షియర్‌ 2016లో అరెస్టయ్యారు.

ముకుంద్‌ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ ఛానల్‌ ముఖాముఖిలో చెప్పారనేది ఆరోపణ. ఈ వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని ముకుంద్‌ పరువునష్టం కేసు దాఖలు చేశారు. అనంతరం ముకుంద్ చంద్ బోత్రా చనిపోగా.. ఆయన కుమారుడు గగన్‌ బోత్రా కేసును కొనసాగిస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణ జరగ్గా.. సెల్వమణి హాజరుకాలేదు. దీంతో చెన్నై జార్జ్‌ టౌన్‌ కోర్టు ఈ మేరకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.