Newspillar
Newspillar
Thursday, 31 Aug 2023 00:00 am
Newspillar

Newspillar

దోమలపెంట రిపోర్ట్- ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మళ్లీకార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంలో (Srisailam) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక లలితాంబికా దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఎల్‌ బ్లాక్‌ దుకాణ సముదాయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న (EO Lavanna) ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదం కారణంగా  సుమారు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా సుమారు 2 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే దుకాణ సముదాయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని శ్రీశైలం ఆలయ ఈఓ లవన్న తెలిపారు.