Newspillar
Newspillar
Monday, 25 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

న్యూ ఢిల్లీ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో (Droupadi Murmu) సమావేశం అయ్యారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ లతో కలిసి మంగళవారం రాష్ట్రపతిని కలిశారు లోకేశ్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్‌ పాలన, ప్రతిపక్షాల అణచివేత, వైసీపీ అరాచక పరిపాలన గురించి రాష్ట్రపతికి వివరించారు టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరారు నారా లోకేశ్.