Newspillar
Newspillar
Friday, 06 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్‌ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నారు. అంతే కాదు ఆయనకు ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్‌ వచ్చిందని సీఎం తనయుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) చెప్పారు. రాష్ట్రంలో సీఎం అల్పాహార పథకం ప్రారంభ సందర్భంగా కేటీఆర్‌ ఒక టీవీ ఛానెల్‌ తో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తరువాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ మొదలైందని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం గురించి బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.