Newspillar
Newspillar
Tuesday, 10 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

పొలిటికల్ రిపోర్ట్- కేసీఆర్ (KTR) కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాల అమిత్‌ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జనగర్జన సభలో అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్‌ షాకు లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈమేరకు కేటీఆర్ (KTR) ఓ వీడియోను విడుదల చేశారు. అమిత్ షా, మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణలో బీజేపీకి తిరస్కారం తప్పదని అన్నారు. మళ్లీ బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమని కేటీఆర్ చెప్పారు. అమిత్‌ షా కొడుకు క్రికెట్‌ ఎప్పుడు ఆడారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని అన్నారు. మా స్టీరింగ్‌ మా చేతుల్లోనే ఉందన్న కేటీఆర్.. బీజేపీ (BJP) స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉందని కౌంటర్ ఇచ్చారు.