వైరల్ అవుతున్న ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ కలసి దిగిన ఫోటో
ఇంటర్నేషనల్ రిపోర్ట్- మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg), ట్విటర్ (Twitter) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య వ్యాపారసంబంధమైన పోటీ నేపధ్యంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విటర్ కు పోటీగా జుకర్ బర్గ్ థ్రెడ్స్ను (Threads) తీసుకురావటంతో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో ట్విటర్ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేశారని మస్క్ ఆరోపించటంతో వివాదం మరింత ముదిరింది. ఇలా వీరిద్దరి మధ్య పోటీ నడుస్తున్న టైంలో ఇద్దరూ కలిసిన సోషల్ సోషళ్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో సర్వత్రా ఆసక్తినెలకొంది.
మొన్నా మధ్య ఓ యూజర్ AI సాయంతో మస్క్, జుకర్ బర్గ్ కలసి ఉన్నట్లుగా ఫోటోలు క్రియేట్ చేశాడు. మంచి ముగింపు.. అంటూ క్యాప్షన్ పెట్టి మరీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బీచ్ లో ఓ జంట ఫోటో షూట్లో పాల్గొన్నట్లుగా అచ్చం అలాగే వీటిని సృష్టించాడు ఏఐ యూజర్. ఇద్దరు బిలియనీర్లు చెట్టాపట్టాలు వేసుకొని బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లు, ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నట్లు, ఇద్దరూ బీచ్లో గంతులేస్తున్నట్లు ఎంతో అందంగా వీటిని రూపొందించాడా యూజర్.
ప్రస్తుతం ఈ బిలియనీర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఎలాన్ మస్క్ సైతం స్పందించారు. జస్ట్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసి తనదైన స్టైల్లో రేస్పాండ్ అయ్యారు. ఇక వీరిద్దరి ఫోటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మస్క్ ఏమైనా ఈ రోజు మెటాను కొనుగోలు చేశారా అని ఒకరంటే, వాస్తవానికి వారు మీమ్స్ కోసం ఇలా కలిసి ఫోటోషూట్ చేయాలని మరొకరు మెంట్ చేశారు. మొత్తానికి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది కాసేపటికే 7 మిలయన్ల మంది వీక్షించడంతో పాటు లక్ష మందికి పైగా లైక్ చేయడం విశేషం.