Pawan

పవన్ కల్యాణ్‌ తొలి ఇన్‌స్టా పోస్ట్‌ లో ఏం చెప్పారంటే..

స్పెషల్ రిపోర్ట్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మొన్నీమధ్యనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. ఆయన ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే లక్షల మంది ఫాలోవర్స్‌ ను సొంతం చేసుకుని రికార్డు నెలకొల్పారు. జులై 4న ఇన్‌స్టా అకౌంట్ ను ప్రారంభించిన పవన్‌, తాజాగా తొలి పోస్ట్‌ ను పెట్టారు. అంతే కాదు ఓ ప్రత్యేకమైన వీడియోను సైతం పోస్ట్ చేశారు పవన్. ఇక తన మొదటి ఇన్స్ఠా పోస్ట్ కు ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్.. అనే స్లోగన్‌ కు కూడా యాడ్ చేశారు పవన్ కళ్యణ్. ఆయన సినీ కెరీర్‌ కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు.

పవన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను.. అని ఆ వీడియో ప్రారంభమైంది. ఇక.. మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ.. అని క్యాప్షన్‌ ను యాడ్ చేశారు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన బ్రో (BRO) సినిమా జులై 28న విడుదలవుతోంది. దీంతో పాటు సుజిత్‌ దర్శకత్వంలో ఓజీ లో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. మరోవైపు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ లో చేసైతం నటిస్తున్నారు. 
 


Comment As:

Comment (0)