Rahul Gandhi

రాజీవ్‌ గాంధీకి పాంగాంగ్‌ సరస్సు వద్ద నివాళులర్పించిన రాహుల్‌ గాంధీ

జమ్మూ కశ్మీర్ రిపోర్ట్- భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ (Rajiv Gandhi) 79 వ జయంతి నేపధ్యంలో ఆయన తనయుడు, కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లోని లేహ్‌ లో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ, భారత్‌ చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు (Pangong Lake) కు బైక్ యాత్ర చేపట్టారు. శనివారం రాత్రి  పాంగాంగ్‌ సరస్సు దగ్గర ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌ లో బస చేశారు రాహూల్ గాంధీ. ఈ నేపధ్యంలో ఆదివారం రాజీవ్‌ గాంధీ జయంతిని ఈ సరస్సు దగ్గరే నిర్వహించారు.

అటు దిల్లీలో (Delhi) రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు నివాళులర్పించారు. ఆగస్టు 25 వరకూ లేహ్‌ లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ.. అక్కడ జరిగే ఓ ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ ను కూడా వీక్షిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్పాయి. లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరగనున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ పలువురితో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ లర్గాలు తెలిపాయి. Rajiv Gandhi Birthday


Comment As:

Comment (0)