కేటీఆర్ నాటుకోడి కూర వైరల్

నాటుకోడి కూర వండిన మంత్రి కేటీఆర్‌

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) నాటుకోడి కూర వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన మైవిలేజ్ షో బృందం సభ్యులతో కలిసి ఇటీవల హైదరాబాద్‌ శివారులో నాటుకోడి కూర వండి, వారితో కలిసి భోజనం చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా సదరు బృందం సభ్యులతో పలు అంశాలపై ఇష్టాగోష్టిగా ముచ్చటించారు మంత్రి. బృందం సభ్యుల్లో ఒకరైన గంగవ్వతో ఎవరూ పోటీ పడలేరని, పోటీ పడేది మంత్రి మల్లారెడ్డి ఒక్కరేనంటూ కేటీఆర్ సరదాగా కామెంట్ చేశారు.

ఈ సందర్లంబంగా బృందం సబ్యుల విజ్ఞప్తి మేరకు లంబాడిపల్లె గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చడంతో పాటు రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. సాధారణ మహిళ గంగవ్వ జీవితకథ గురించి తెలుసుకున్న కేటీఆర్ ఆమెను కొనియాడారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఈ సందర్బంగా చెప్పొకొచ్చిన కేటీఆర్.. రైతులు సన్నబియ్యం పండించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ నాటు కోడి వండిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Comment As:

Comment (0)