38 మంది అభ్యర్ధుల బీజేపీ మొదటి జాబితా
బీజేపీ ప్రకటించే అభ్యర్ధుల తొలి జాబితా ఇదేనా?
పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనుండటంతో భారతీయ జనాతా పార్టీ (BJP) అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ముందుగా ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలోని అధిష్ఠానానికి పంపించింది. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో అమావాస్య తరువాత ఈ నెల 15 లేదా 16న 38 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
38 అభ్యర్ధులను ప్రకటించనున్న నేపధ్యంలో ఏకాభిప్రాయం కుదరని మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కొనసాగుతున్నట్లు బీజేపీ (Telangana BJP) నేతలు తెలిపారు. మరో వారం రోజుల్లో మిగతా నియోజకవర్గాల స్థానాలపైనా క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. ఇక బీజేపీ ప్రకటించే 38 మందితో కూడిన మొదటి జాబితాలోని పేర్లపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలా ప్రచారం జరుగుతున్న పేర్ల జాబితాను పరిశీలిస్తే..
అంబర్పేట - కిషన్ రెడ్డి
సనత్నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి
మల్కాజిగిరి - రాంచందర్రావు
ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
రాజేంద్రనగర్ - తోకల శ్రీనివాస్ రెడ్డ్
మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్
గోషామహల్ - విక్రమ్ గౌడ్
సికింద్రాబాద్ - బండ కార్తీక రెడ్డి
కల్వకుర్తి - తల్లోజు ఆచారి
గద్వాల - డీకే అరుణ
మహబూబ్నగర్ - జితేందర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్య గౌడ్
తాండూరు - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి
హుజురాబాద్ - ఈటల రాజేందర్
ఆలేరు - కాసం వెంకటేశ్వర్లు
కరీంనగర్ - బండి సంజయ్
చొప్పదండి - బొడిగే శోభ
భూపాలపల్లి - చందుపట్ల కీర్తిరెడ్డి
వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వేములవాడ - చెన్నమనేని వికాస్ రావు
ఆదిలాబాద్ - పాయల్ శంకర్
బోథ్ - సోయం బాపూరావు
మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆర్మూర్ - ధర్మపురి అర్వింద్
సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర్లు
పరకాల - గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
వర్ధన్నపేట - కొండేటి శ్రీధర్
మహబూబాబాద్ - హుస్సేన్ నాయక్
దుబ్బాక - రఘునందన్ రావు
నర్సంపేట - రేవూరి ప్రకాశ్ రెడ్డి
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
వరంగల్ పశ్చిమ - ఏనుగుల రాకేశ్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్ - విజయరామారావు
ఈ పేర్లు కేవలం సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే. బీజేపీ అధికారికంగా ఇంకా అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.