Acchennaidu

ఎన్నికల్లో ఓటమి భయంతోనే కొత్త నాటకానికి తెరతీసిన వైసీపీ- అచ్చెన్నాయుడు

అమరావతి రిపోర్ట్- ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిసే సీఎం జగన్‌ (CM Jagan) కొత్త నాటకానికి తెరతీశారని తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. విజయవాడలో జగన్ పై దాడి ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆయన ఆరోపించారు. వివేకా హత్య, కోడికత్తి తరహాలో ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పై దాడి ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారాయన.

ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో మూడు గంటల పాటు కరెంట్ లేపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ సెక్యూరిటీలోని రోప్‌ పార్టీ ఏమైందని నిలదీశారు. నాలుగు రోజుల్లో సంచలనాత్మక ఘటన జరుగుతుందని.. ఆ ఘటన వల్ల ఎన్నికల్లో చాలా మార్పులు రాబోతున్నాయని 4రోజుల క్రితం వైసీపీ నేత ట్వీట్‌ చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. సదరు వైసీపీ నాయకుడు చెప్పినట్టే సరిగ్గా నాలుగు రోజులకే పధకం ప్రకారం ఘటన జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.


Comment As:

Comment (0)