Lokesh Nara..

నారా లోకేశ్ ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆలర్ట్ చేసిన  యాపిల్‌

ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపించడం ఆసక్తికరమంగా మారింది. లోకేశ్ మొబైల్ ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని యాపిల్ హెచ్చరించింది. ఈమేరకు లోకేశ్ కు యాపిల్ ఈమెయిల్ పంపించింది. ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని లోకేశ్ కు సూచించింది యాపిల్ సంస్థ. ఈ క్రమంలో లోకేశ్ ఫోన్‌ను వైసీపీ ప్రభుత్వమే ట్యాప్‌ చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకేశ్ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబందించి ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎన్నికల వేళ లోకేశ్ ఫోన్ ట్యాపింగ్ అంశం సర్వత్రా ఆసక్తిరేపుతోంది.


Comment As:

Comment (0)