చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
ఎవరూ ఆందోళన చెందవద్దు.. కుటుంబ సభ్యులతో చంద్రబాబు
అమరావతి రిపోర్ట్- స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ (AP Skill Development Corporation Scam) లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును పరామర్శించేందుకు వారి కుటుంబ సభ్యులు కుంచినపల్లిలోని సీఐడి కార్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల నిరీక్షణ తర్వాత చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు సీఐడీ అధికారులు అనుమతిచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ధర్మం, న్యాయం తనవైపే ఉన్నాయని, కుట్ర రాజకీయాలను సమర్థంగా ఎదుర్కొంటానని చంద్రబాబు మరోసారి చెప్పారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ వెళ్లి పోయారు. సీఐడి కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది.