కొత్తకోట దయాకర్ రెడ్డి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇక లేరు
హైదరాబాద్- తెలంగాణ మాజీ శాశన సభ్యుడు ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొత్తకోట దయాకర్రెడ్డి మూడు సార్లు తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింత నుంచి రెండుసార్లు, మక్తల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్రెడ్డి పనిచేశారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పరకాపురం కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం.
కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యఖుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.