Sridevi Lokesh

నావెనుక చంద్రబాబు,లోకేష్ ఉన్నారు- శ్రీదేవి

నన్ను ఎవరు ఏమీ పికలేరు- ఎమ్మెల్యే శ్రీదేవి 

పొలిటికల్ రిపోర్ట్- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని, తనను ఎవరూ ఏమీ పీకలేరంటూ వైసీపీకి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (yuvagalam) గుంటూరు జిల్లా తాడికొండ (Tadikonda) నియోజకవర్గంలో కొనసాగుతోంది. యువగళం 183వ రోజు పాదయాత్ర సందర్భంగా అమరావతి ఆవేదన పేరుతో రావెలలో అమరావతి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లా చర్చనీయాంశమవుతున్నాయి. 

తాను అమరావతి (Amaravati) రాజధాని కోసం మాట్లాడితే తాడికొండ నియోజకవర్గంలో ఎలా తిరుగుతావో చూస్తామని హెచ్చరించారని, ఇదిగో ఇప్పుడిలా ధైర్యంగా అందరి అండదండలతో తిరగగలుగుతున్నాను అన్నారు ఉండవల్లి శ్రీదేవి. తాను ఇంత ధైర్యంగా మాట్లాడటానికి చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన భరోసానే కారణమని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ మాట విని అమరావతి రైతులను తాను కూడా మోసం చేశానని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు తనను క్షమించాలని వేడుకున్న శ్రీదేవి, ఏదైనా మాట్లాడితే మంత్రులు పది మంది తనను ట్రోల్‌ చేసి వేధిస్తారని వెనకడుగు వేసే సమస్య లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన ధైర్యంతోనే తాను ముందుకు వచ్చానన్న శ్రీదేవి.. ఇక తనను ఎవరు ఏమీ పీకలేరని ఘాటి వ్యాఖ్యలు చేశారు.


Comment As:

Comment (0)