నారా లోకేశ్కు తప్పిన ప్రమాదం - యువగళం పాదయాత్రలో మీదపడ్డ జనం
స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కు యువగళం పాదయాత్రలో (Yuvagalam Padayatra) తృటిలో ప్రమాదం తప్పింది. దర్శి (Darsi) నియోజకవర్గంలో పాదయాత్రలో ఒక్కసారిగా జనం మీదపడటంతో లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో జనం తోపులాటలో మొత్తం మూడుసార్లు కిందపడే ప్రమాదం నుంచి లోకేశ్ బయటపడ్డారు. యువగళం పాదయాత్రలో జనం తోపులాటలో తరచుగా లోకేశ్ చేతులు, కాళ్లకు గాయాలవుతున్నాయి.
ఈ క్రమంలో జనాన్ని అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే లోకేశ్ కు భద్రత కల్పించడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ (YCP) అధిష్టానం ఒత్తిడితోనే పోలీసులు లోకేశ్ పాదయాత్రకు భద్రత తగ్గించారని టీడీపీ నేతలంటున్నారు.