Modi PM

దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి - సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం..

నేషనల్ రిపోర్ట్- భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపధ్యంలో ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు కేంద్రం హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra Modi) దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పకుండా తమ సోషల్ మీడియా అకౌంట్స్ కు సంబందించి (Social Media) డీపీగా (Display Photo) మన దేశ జాతీయ జెండా ( National Flag)ను పెట్టుకోవాలని కోరారు. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం తన ట్విటర్‌ ఖాతాలో ఈమేరకు ట్వీట్ చేశారు.

ట్విట్టర్ లో ప్రధాని మోదీ (PM Modi) ఏంచెప్పారంటే.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో మనమంతా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియా ఖాతాల డీపీలో జాతీయ జెండాను ఉంచుదాం.. దేశానికి, మనకు మధ్య బంధాన్ని పెంపొందించే ఈ కార్యక్రమానికి మన వంతు మద్దతునిద్దాం.. అని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరుల్లో దేశ భక్తిని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.


Comment As:

Comment (0)