Uppal Stadium

ఉప్పల్‌ లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. క్షణాల్లో టికెట్లు మాయం

హైదరాబాద్ రిపోర్ట్- హైదరాబాద్ క్రికెట్‌ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో (Uppal Stadium) జరిగే ఐపీఎల్‌ (IPL 2024) క్రికెట్ మ్యాచ్‌ లకు టికెట్లు ఏ మాత్రం అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నెల 25న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌, వచ్చే నెల మే 2 రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ లకు సంబందించిన టికెట్లనుపేటీఎంలో విక్రయానికి పెట్టారు నిర్వాహణకులు. ఐతే టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన కొన్ని క్షణాల్లో సోల్డ్‌ అవుట్‌ అని చూపించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సన్‌రైజర్స్‌ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతోందో చెప్పడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు


Comment As:

Comment (0)