Delhi Crime

పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు

స్పెషల్ రిపోర్ట్- దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. క్రైం రేట్ అంతకంతకు పెరిగిపోతోంది. దిల్లీ (Delhi) లో దారుణం జరిగింది. తాను పోలీసునంటూ ఓ అమ్మాయిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోలు చూపించి ఆమెపై అత్యాచారం జరిపాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 7న ఓ కాలేజీ విద్యార్థిని తన బాయ్‌ ఫ్రెండ్‌ తో కలిసి కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్‌ పై వారిని నిలువరించి.. వారి ఫొటోలు, వీడియోలు ఫోన్ లో చిత్రీకరించాడు.

ఆ తరువాత ఆ అమ్మాయిని ఇంటిదగ్గర దిగబెట్టి బాయ్‌ ఫ్రెండ్‌ వెళ్లగానే నిందితుడు ఆమె దగ్గరకు వచ్చాడు. తాను పోలీసునని అబద్దం చెప్పి.. ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత అపార్ట్‌ మెంట్‌ బయటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.


Comment As:

Comment (0)