మరదలిపై కన్నేసిన బావ
మరదలిపై కన్నేసిన బావ.. శిరీష హత్యకేసులో బావే దోషి
క్రైం డెస్క్- వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్ అని పోలీసులు నిర్ధారించారు. తన కోరిక తీర్చేందుకు ఒప్పుకోకపోవడం వల్లే శిరీషను దారుణంగా హతమార్చినట్టు ఎస్పీ చెప్పారు. శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్ కు దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నాడు. దీనికి శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్ లలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ఇదే విషయంలో శిరీష తండ్రి, సోదరుడు, బావ అనిల్ మధ్య వాగ్వాదం జరిగింది. అనిల్ ఆమెపై చాలాసార్లు దాడి కూడా చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెంటే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఫుల్ గా మద్యం మత్తులో ఉన్న అనిల్. శిరీషపై బీరు బాటిల్ తో దాడిచేసి నీటికుంటలో ముంచి దారుణంగా చంపేశాడని పోలీసులు తెలిపారు.