Apsara-murder

కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో

పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

క్రైం న్యూస్- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో పూజారి చేతిలో హత్యకు గురైన మహిళ అప్సర కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణతో సంబందం కంటే ముందే అప్సరకు పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మరో ట్విస్ట్‌ ఆసక్తికరంగా మారింది. అప్సరను లవ్ మ్యారేజ్ చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కార్తీక్ రాజా, ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకే ఆత్మహత్యకు చేసుకుని చనిపోయాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఈ విషయాన్ని చెప్పింది ఆమేరకు ధనలక్ష్మి ఆడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తన కొడుకు కార్తీక్ ను అప్సర మానసికంగా వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ అంటోంది.

కార్తీక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అప్సర, ఆ తరువాత కొన్ని రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ వేధింపులకు గురి చేశారని ధనలక్ష్మి చెబుతోంది. అప్సర తల్లి అరుణ సైతం తన కొడుకును వేధించిందని ఆరోపించింది. అప్సర, ఆమె తల్లి అరుణ తన కుమారుడితో ప్రతి రోజు గొడవలు పడే వారని, తన కొడుకుపై పోలీస్ స్టేషన్‌ లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడని, అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడని చెప్పింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని.. తన కొడుకు మరణానికి అప్సర, ఆమె తల్లి అరణే కారణమని ఆరోపించింది.

ఇక తన కొడుకు కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి అప్సర, ఆమె తల్లి ఇద్దరూ కనిపించలేదని, ఇన్నాళ్లకు అప్సర హత్యకు గురైందని టీవీలో వార్తను చూసి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. అప్సర, ఆమె తల్లి అరుణ హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తనకు తెలిదన్న ధనలక్ష్మి, ముందు నుంచి అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని ఆడియోలో చెప్పింది.


Comment As:

Comment (0)