మెగా హీరోల సందడి
వైభవంగా మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం..
ఫిల్మ్ న్యూస్- మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒక్కటి కాబోతున్నారు. ఈ యేడాది చివర్లో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఎంగేజ్ మెంట్ వేడుకలో ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు, కొంత మంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
వరుణ్ తేజ్ (VarunTej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మొదటి సారి 2017లో విడుదలైన మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దు స్నేహితులయ్యారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో అంతరిక్షం మూవీ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 25న ఈమూవీ విడుదల కానుంది. అటు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం అధర్వ హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిననున్న మరో సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రానున్న ఓ వెబ్సిరీస్లోనూ నటించబోతోంది. ఇక వీరిద్దరి వివాహం ఈ యేడాది చివరలో జరగనుందని సమాచారం.