ఈనెల 20న కొల్లాపూర్‌ కు ప్రియాంక గాంధీ – భారీ భహిరంగ సభ

న్యూఢిల్లీ-కొల్లాపూర్- ఇతర పార్టీల నేతల చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి జోష్ కనిపిస్తోంది. ఖమ్మంలో లక్షలా­ది మందితో నిర్వహించిన జనగర్జన సభ సక్సెస్ కావడంతో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమ­వు­తోంది కాంగ్రెస్. ఈ నెల 20న నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ లో భారీ భహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది హస్త పార్టీ. ఖమ్మం సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా రాగా, కొల్లాపూర్‌ సభకు ప్రియాంకా గాంధీ హాజర­య్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కొల్లాపూ­ర్‌ సభకు హాజరు కావాలని కోరుతూ ప్రియాంకా గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్‌ పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే లేఖ రాశారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 20న ప్రియాంక గాంధీ సభ ఖరారైనట్టేనని, అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అని పార్టీ ముఖ్యనేతలంటున్నారు. ప్రియాంక హాజరయ్యే కొల్లాపూర్ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి తో పాటు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. సుమారు లక్ష మందితో కొల్లాపూర్ భహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస కసరత్తు చేస్తోంది.


Comment As:

Comment (0)