చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు
ఏపీ హైకోర్టులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట
స్పెషల్ రిపోర్ట్- మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరు (guntur) లో చిరంజీవిపై ఓ కేసు నమోదైంది. స్థానికంగా జరిగిన ఎన్నికల ప్రచార సమావేశాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, దీంతో అప్పట్లో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు.
దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చిరంజీవి ఏపీ హైకోర్టు (AP High Court) ను ఆశ్రయించారు. పిటిషన్ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిరంజీవికి ఎన్నికల నియమావాళి కేసులో ఊరట లభించింది.