KCR Chandrababu

కేసీఆర్ ను పరామర్శించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

కేసీఆర్‌ తో మాట్లాడాలనిపించి వచ్చాను- చంద్రబాబు 

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) వీలైనంత త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆకాంక్షించారు. సోమవారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను, యశోద హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకుంటున్నారని.. ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చానని ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు చంద్రబాబు. కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ కు వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్‌ చేశారన్న చంద్రబాబు.. త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని చెప్పారు.

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తెలంగాణ ఉప డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బీఆర్ఎస్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, బీఎస్పీ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు కేసీఆర్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. 


Comment As:

Comment (0)