Leopard

తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత చిక్కింది

తిరుమలలో చిక్కిన చిన్నారిని చంపిన చిరుత

తిరుపతి- మూడు రోజుల క్రితం శుక్రవారం తిరుమలలో (Tirumala) బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత (Cheetah) ఎట్టకేలకు చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలితో పాటు సమీపంలో మొత్తం మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను  ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల అలిపిరి (Alipiri) కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. 

నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్తుండగా చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో తిరుమలో భక్తులతో పాటు అంతా భయబ్రాంతులకు గురయ్యారు. బాలిక మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఐతే బాలికను చంపిన చిరుత ఇదేనా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదని అధికారులు చెప్పారు.


Comment As:

Comment (0)