భార్య సురేఖతో కలిసి ఆమెరికా వెళ్లిన చిరంజీవి
సినిమా న్యూస్- మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమయం దొరికినప్పుడల్లా విదేశీ టూర్స్ కు వెళ్తుంటారు. షూటింగ్ విరామ సమయాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం భోళా శంకర్ (Bholaa Shankar) మూవీ షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న చిరంజీవి, తన సతీమణి సురేఖ (Surekha) తో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్లారు. ఈమేరకు చిరంజీవి స్వయంగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
నా భార్యతో కలిసి చిన్న వెకేషన్కు అమెరికా (America) వెళ్తున్నా.. తర్వాతి సినిమా మొదలుపెట్టే ముందు రీఫ్రెష్ అయ్యేందుకు.. అంటూ సురేఖతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు చిరంజీవి. అంతేకాదు తాను నటించనున్న నెక్స్ట్ మూవీ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమని తెలిపారు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల సొంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ (Gold Box Entertainment) పతాకంపై నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి తన భార్య సురేఖతో ఫ్లైట్ లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవికి మెహర్ రమేష్ (Mehar Ramesh) దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.