School

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విధ్యార్ధి మృతి

హోమ్‌ వర్క్‌ చేయలేదని చిన్నారిని పలకతో కొట్టిన టీచర్‌.. 

హైదరాబాద్ రిపోర్ట్- హైదరాబాద్‌ లో ఘోరం జరిగింది. రామంతాపూర్‌ పరిధిలోని వివేక్‌ నగర్‌లో హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. యూకేజీ విధ్యార్ధి హేమంత్ ను టీచర్ శనివారం తలపై పలకతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం హేమంత్ మృతి చెందాడు. దీంతో రామంతాపూర్‌ లోని పాఠశాల దగ్గర విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Comment As:

Comment (0)