రాజా రెడ్డి వెడ్స్ అట్లూరి ప్రియ
కుమారుడి పెళ్లిపై వైఎస్ షర్మిల ట్వీట్
హైదరాబాద్ రిపోర్ట్- దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో పెళ్లి బాజా మోగబోతోంది. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి జరగనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో తన కుమారుడు రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు షర్మిల చెప్పారు. ట్వీట్ లో వైఎస్ షర్మిల ఏంచెప్పారంటే.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం.. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.. మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తాం.. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం.. అని ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ లో పేర్కొన్నారు వైఎస్ షర్మిల.