Samantha

ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.. ఆసక్తికరంగా సమంత పోస్ట్‌

స్పెషల్ రిపోర్ట్- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha),  అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తో విడిపోయాక ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. సమంత సోషల్ మీడియాలో ఏ చిన్నపోస్ట్ పెట్టిన అది వైరల్ అవుతోంది.   ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె యేడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సమంత ఇన్‌ స్టా స్టోరీ చూస్తే అది అక్షరాల నిజమేననే భావన కలుగుతోంది.

మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌ లో ఉండేది అని కామెంట్ పెట్టిన సమంత, తన ఇన్‌ స్టాలో కారవాన్‌ ఫొటో పెట్టింది. అలాగే తన ఫొటో షేర్‌ చేస్తూ.. ఆరు నెలలు కష్టంగా గడిచాయి.. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.. అని రాసుకొచ్చింది. దీంతో తాను ఎంత కష్టంగా షూటింగ్స్‌ లో పాల్గొందో అని ఆమె అభిమానులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌ చూసి అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.  

విజయ్‌ దేవకొండ (Vijay Deverakonda) సరసన సమంత (Samantha) నటిస్తోన్న ఖుషి (Kushi) షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నా రోజా నువ్వే... అంటూ సాగే పాటని విడుదల చేయగా అది ట్రెండింగ్‌ లో ఉంది. సోషల్ మీడియాలోను వంద మిలియన్ల వ్యూస్‌ కి చేరువలో ఉంది. ఖుషి సినిమా సెప్టెంబరు 1న తెలుగు తో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 


Comment As:

Comment (0)