భుజానికి గాయం.. ఎన్టీఆర్కు శస్త్రచికిత్స
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు త్వరలో శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల ఆయన భుజానికి గాయం కావడంతో వైద్యులు పరీక్షించారు. గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.
వైద్యుల సూచనల మేరకు బుధవారం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్కు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్కు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని ఆయన కార్యాలయం తెలిపింది. సర్జరీ అనంతరం ఆయన త్వరగా పూర్తిస్థాయి ఆరోగ్యంతో కోలుకునేలా వైద్యులు పర్యవేక్షించనున్నట్లు పేర్కొంది.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స అనంతరం పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న విషయం ఒక్కటే.. సర్జరీ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్స్లో ఎప్పుడు పాల్గొంటారన్నది.
