తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఫిక్స్.. ఏ థియేటర్లో ఎంతంటే?
తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు ప్రభుత్వం కొత్త పరిమితులు నిర్ణయించింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో టికెట్ల ధరలు ఎంతంటే?
తెలంగాణలో సినిమా ప్రేక్షకులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్ల ధరలకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్ రకం, టికెట్ కేటగిరీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండేలా కొత్త రేట్లను నిర్ణయించింది.
నాన్ ఏసీ థియేటర్లలో..
నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70గా నిర్ణయించారు. ఇక ప్రీమియం కేటగిరీలో కనిష్ఠ ధర రూ.50 కాగా.. గరిష్ఠంగా రూ.100 వరకు వసూలు చేయవచ్చు.
ఏసీ థియేటర్లకు కొత్త రేట్లు
ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్లకు రూ.50 నుంచి రూ.150 వరకు ధర నిర్ణయించారు. ప్రీమియం టికెట్లకు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200గా ప్రభుత్వం నిర్దేశించింది.
స్పెషల్ థియేటర్లలో..
స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ల ధర రూ.100 నుంచి రూ.250 వరకు ఉండనుంది. ఇక ప్రీమియం రిక్లైనర్ సీట్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా రేట్లను ఖరారు చేశారు.
మల్టీప్లెక్స్ల్లో ఎంతంటే?
మల్టీప్లెక్స్లలో రెగ్యులర్ టికెట్కు రూ.100 నుంచి రూ.250 వరకు ధర ఉండనుంది. రిక్లైనర్ సీట్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 వరకు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
కొత్త రేట్లు ఇలా..
నాన్ ఏసీ: రూ.30–70 | ప్రీమియం రూ.50–100
ఏసీ: రూ.50–150 | ప్రీమియం రూ.100–200
స్పెషల్ థియేటర్: రూ.100–250 | రిక్లైనర్ రూ.200–300
మల్టీప్లెక్స్: రూ.100–250 | రిక్లైనర్ రూ.200–300
థియేటర్ రకాన్ని బట్టి టికెట్ ధరల్లో స్పష్టమైన పరిమితులు విధిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక తెలంగాణలో సినిమా టికెట్ల ధరల విషయంలో థియేటర్ల వారీగా కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
